సంగారెడ్డి: సదాశివపేట మున్సిపల్ అధికారులు ఏసీబీ వలలో చిక్కారు. 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ RI వెంకట రావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వేణుగోపాల శర్మలు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెండ్ గా దొరికారు. బాధితుడు ఇంటి నంబర్ కోసం మున్సిపల్ అధికారులను సంప్రదించగా.. వారు రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీంతో అతడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. దీంతో అవినీతి అధికారుల గుట్టురట్టు అయింది. బాధితుడి నుంచి అధికారులు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Also Read.. కేఆర్ఎంబీ చేతికి నాగార్జున సాగర్ ప్రాజక్టు నిర్వాహణ!