హైదరాబాద్ : సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివెల్-2024 సందర్భంగా నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్ పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ అదనపు సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.
Also Read.. రామమందిర ప్రాణప్రతిష్ఠకు నాకు ఆహ్వానం అందలేదు
ఈ సందర్భంగా అలుగడ్డబావి ఎక్స్ రోడ్స్, సంగీత్ ఎక్స్ రోడ్స్, వైఎంసీఏ ఎక్స్ రోడ్స్, ప్యాట్నీ, ఎస్బీహెచ్, ఫ్లాజా, సీటీఓ, బ్రూక్ బాండ్, తివోలి, స్వీకార్ ఉపకార్ జంక్షన్స్, సికింద్రాబాద్ క్లబ్, తాడ్బన్ క్రాస్ రోడ్స్, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోయిన్పల్లి ఎక్స్ రోడ్స్, రసూల్పురా, బేగంపేట్, పారడైజ్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించారు.
Also Read.. ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతం
తివోలి క్రాస్ రోడ్డు నుంచి ఫ్లాజా ఎక్స్ రోడ్డు వరకు రోడ్డును మూసేసి, ట్రాఫిక్ను ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మళ్లించనున్నట్లు వెల్లడించారు. రైల్వే స్టేషన్, జూబ్లీ బస్స్టాండ్కు వచ్చిపోయే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు. గ్రౌండ్కు వచ్చే వారికి కేటాయించిన పార్కింగ్ స్థలాల్లో వాహనాలను పార్కు చేయాలని వెల్లడించారు.