రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్పోర్టులో రూ.6కోట్ల విలువైన వజ్రాలు, విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఆర్ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చారు.
Also Read.. ఆర్టీసీ పందెం కోడి కథ సుఖాంతం
వారి ప్రవర్తన అనుమానస్పదంగా ఉండటంతో..వారిని అదుపులోకి తీసుకుని సామగ్రిని తనిఖీ చేశారు. చాక్లెట్ కవర్లలో ప్రత్యేకంగా ప్యాక్ చేసిన రూ.6 కోట్ల విలువైన డైమండ్స్, రూ. 9.83 లక్షల విదేశీ కరెన్సీ, రూ.లక్ష నగదు గుర్తించి షాక్ అయ్యారు. సరైన ఆధారాలు లేకపోవడంతో ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.