లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖలో గత వారంలో రోజుల్లో 225 డీఎస్పీలను బదిలీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. లేటెస్టుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 26 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ రవిగుప్తా ఇవాళ(గురువారం) ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎస్ అధికారుల నుంచి అన్ని హోదాలలో ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
గతమూడేళ్లుగా ఒకే దగ్గర పని చేస్తున్న, సొంత జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ డిసెంబర్లో ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం అధికారులకు ట్రాన్స్ఫర్స్ చేయనున్నట్లు పోలీసుశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి:మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం