రాష్ట్రంలో పనిచేస్తున్న 32 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిటల్ ఇవాళ (శనివారం) రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం ఒకే జిల్లాలో పనిచేసిన అధికారులను ఈనెల 15 లోపు బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు.
అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో తహసీల్దార్లను బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరం గురించి ఎలాంటి అవగాహన లేదు