Friday, May 17, 2024

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ

spot_img

కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భిక్కనూర్ మండల కేంద్ర శివారులోని మాల్గుడి దాబా వద్ద జాతీయ రహదారిపై బుధవారం రాత్రి లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్‎తో పాటు, పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాదు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే దారిలో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈఘటనలో నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‎కు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న మరి కొంతమంది ప్యాసింజర్లకు కూడా గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు బస్ డ్రైవర్‎తో పాటు ప్రయాణికులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles