తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 6 న గరుడ సేవను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్నారు. ఐతే ఈ నెల మాత్రం ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా పౌర్ణమి గరుడ సేవను రద్దు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆలయ అధికారులు కోరారు.