Friday, May 10, 2024

కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం-మంత్రి ఎర్రబెల్లి

spot_img

కంటి వెలుగు కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అంధత్వ నివారణ లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా హనుమకొండ కలెక్టరేట్‌లో జరిగిన వరంగల్, హనుమకొండ జిల్లాల సన్నద్ధత సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం విషయంలో ఎంతో పట్టుదలతో ఉన్నారని చెప్పారు. కంటి వెలుగు క్యాంపులకు అవసరమైన సదుపాయాలను ముందుగానే కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

Latest News

More Articles