ఏడుకొండలస్వామి వారి దర్శనంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. 25ఏళ్ల యువత గోవింద కోటి అని పది లక్షల 116సార్లు రాస్తే వారికి శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. యువతలో తిరుమల శ్రీవారిపై భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఈవో వెల్లడించారు.
శుక్రవారం తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 75వ గణతంత్రదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధర్మారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏప్రిల్ నెల శ్రీవారి దర్శన టికెట్లు పొందిన భక్తుల మాత్రమే మొదటిసారిగా వసతి గదులు కేటాయింపును ఆన్ లైన్ లోనే చేపట్టినట్లు ఆయన తెలిపారు. అన్నప్రసాద విభాగాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి సుమారు 24గంటల సమయం పడుతుందన్నారు.