Sunday, April 28, 2024

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్‌లో కలకలం.. బాత్రూంలో ఇద్దరు అగంతకులు!

spot_img

సికింద్రాబాద్ పీజీ ఉమెన్స్ హాస్టల్లో భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. హాస్టల్ బాత్రూంలోకి ఇద్దరు అగంతకులు చొరబడటంతో కలకలం రేగింది. అది గమనించిన విద్యార్థినులు ఒక అగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మాత్రం హాస్టల్లోకి చొరబడింది ఒక వ్యక్తి మాత్రమే అంటున్నారు. ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమ భద్రతపై నిరసన తెలుపుతూ విద్యార్ధినులు ఆందోళన చెపట్టారు. తమక రక్షణ లేదంటూ నినాదాలు చేశారు. వీసీ వచ్చి తమ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్  చేశారు. హాస్టల్లో సెక్యూరిటీ లేదని ఎవరు పడితే వారు వచ్చేందుకు వీలుందని ఇలా అయితే ఎలా అంటూ ప్రశ్నించారు. హాస్టల్ బాత్రూంలోకి దుండగులు వచ్చారంటే..అక్కడ సెక్యూరిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని విద్యార్థులు వాపోతున్నారు. అసలు బాత్రూంలు ఏమాత్రం బాగోకపోయినా…సెక్యూరిటీ లేకపోయినా…వీసీ ఏమాత్రం పట్టించుకోవట్లేదని..విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే తాము ఎలా చదువుకోగలం అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి : నగరవాసులకు తప్పని కరెంటు తిప్పలు..2గంటలు మించుతున్న విద్యుత్ కోతలు..!!

Latest News

More Articles