ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని సీతాగోంది శివారులో జంట హత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన వారిని ఆదిలాబాద్ పట్టణం భుక్తాపూర్కు చెందిన రెహమాన్(20), కేఆర్కే నగర్కు చెందిన అశ్విని(28)గా గుర్తించారు.
కాగా, ఇప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న అశ్విని.. గత కొంతకాలంగా భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటున్నట్లు సమాచారం. ఆమెకు రెహమాన్తో వివాహేతర సంబంధం ఉండడం వల్లే జంట హత్యలు జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రెహమాన్, అశ్వినిలు శుక్రవారం ఆదిలాబాద్ నుంచి సీతాగోందికి చేరుకొని.. స్థానిక పంట పొలంలోకి బైకుపై వెళ్లడాన్ని సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష కోసం రిమ్స్కు తరలించినట్లు, దర్యాప్తు జరుగుతున్నట్లు డీఎస్పీ నాగేందర్ తెలిపారు.