తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ రాష్ట్ర దొంగలను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇమ్రాన్ ఖాన్, నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన సూర్య ఇద్దరు కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు జిల్లా ఎస్పీ కె.అపూర్వ రావు. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా రాత్రి పూట దోపిడీలకు పాల్పడుతున్నారని చెప్పారు.
ఇవాళ(గురువారం) నల్గండ పట్టణంలోని సిమెంట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు ఆపి విచారించగా అసలు విషయం బయటపడింది. నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 21 దొంగతనాలకు పాల్పిడినట్లు వారు ఒప్పుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 20 తులాల బంగారు నగలు, కేజీ వెండి ఆభరణాలు, ఒక ల్యాబ్ ట్యాప్, రెండు సెల్ ఫోన్స్, మూడు ఇనప రాడ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఎస్పీ కె.అపూర్వ రావు.