జమ్మూకశ్మీర్ లోని బారాముల్లాలో భద్రతా దళాలు లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లను ఇవాళ(గురువారం) అరెస్టు చేశాయి. ఫ్రెస్టిహార్ క్రీరి గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ..పోలీసులు భద్రతా బలగాలతో కలిసి ఫ్రెస్టిహార్ వారిపోరా క్రాసింగ్ దగ్గర మొబైల్ వెహికల్ చెక్ పాయింట్ను ఏర్పాటు చేశాయి. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. భద్రతా బలగాలను గమనించి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అలర్టైన బలగాలు వారిని పట్టుకున్నాయి.