Saturday, May 4, 2024

మలేషియాలో 2 ఆర్మీ హెలికాప్టర్లు కూలి 10 మంది సిబ్బంది మృతి.!

spot_img

మలేషియాలోని నేవల్ బేస్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. మేలో వేడుక కోసం రిహార్సల్ చేస్తున్న రాయల్ మలేషియా నేవీకి చెందిన రెండు హెలికాప్టర్లు గాలిలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. రాయల్ మలేషియా నేవీ పరేడ్ రిహార్సల్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు మలేషియా నేవీ తెలిపింది. మరణించిన వారందరూ నావికాదళ సిబ్బంది అని మలేషియా నేవీ తెలిపింది.

మీడియా నివేదికల ప్రకారం, పెరాక్‌లోని లుముట్ నేవల్ బేస్ వద్ద మంగళవారం ఉదయం 9.30 గంటలకు ప్రమాదం జరిగింది. ఒక హెలికాప్టర్‌లోని రోటర్‌ మరో హెలికాప్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో రన్నింగ్‌ ట్రాక్‌పై హెలికాప్టర్‌ కూలిపోయింది. మరొకటి సమీపంలోని స్విమ్మింగ్ పూల్‌లోకి దూసుకెళ్లింది. అన్ని మృతదేహాలను లుముట్ ఆర్మీ బేస్‌లోని ఆసుపత్రికి పంపారు, అక్కడ వాటిని గుర్తించనున్నారు.

ఇది కూడా చదవండి:సమిష్టిగా కృషి చేస్తే కరీంనగర్ పార్లమెంట్ మనదే 

Latest News

More Articles