బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారంప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 లైవ్ షో బిగ్ డిబేట్ లో పాల్గొనున్నారు. సాయంత్ర 7 గంటల నుంచి ప్రారంభం కానున్నబిగ్ డిబేట్ ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్ యాంకర్ రజనీకాంత్ నిర్వహించనున్నారు. దాదాపు 12ఏండ్ల తర్వాత టీవీ9 లైవ్ షోలో కేసీఆర్ పాల్గొంటున్నారు.
లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 24నుంచి చేపట్టనున్న బస్సు యాత్ర నేపథ్యంలో బిగ్ డిబేట్ కు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సంచలన విషయాలను వెల్లడించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొద్దికాలం క్రితమే తాను టీవీ లైవ్ షోలో పా ల్గొంటానని, అనేక విషయాలను వెల్లడిస్తానని కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందు. ఈ నేపథ్యంలో టీవీ9 షోపై ప్రజ లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.