Friday, May 3, 2024

సస్పెన్షన్ గురైన సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు..రూ. 10కోట్ల ఆస్తులు గుర్తింపు.!

spot_img

మహబూబాబాద్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత నెల 22న లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఇంట్లో అధికారులు సోమవారం మరోసారి తనిఖీలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె పై ఆదాయానికి మించిన ఆస్తులుఉన్నాయన్న ఆరోపణలు రావడంతో హన్మకొండ కాకతీయ కాలనీలో ఇంటితోపాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో తనిఖీలు చేపినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 2.94 కోట్లు. మార్కెట్ విలువ ప్రకారం రూ. 10కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ వరంగల్ రేంజ్ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.

ఇది కూడా చదవండి: మలేషియాలో 2 ఆర్మీ హెలికాప్టర్లు కూలి 10 మంది సిబ్బంది మృతి.!

Latest News

More Articles