ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జాము నుంచే ఆలయంలో అభిషేకం,ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. దీక్షాపరులుస్వామివారిసన్నిధిలో దీక్షా విరమణలుచేస్తున్నారు. అర్థరాత్రి నుంచి సుమారు 50వేల మంది దీక్షాపరులు దర్శించుకున్నట్లు కొండగట్టు ఆలయ అధికారులు తెలిపారు. 22న ప్రారంభమైన ఈ ఉత్సవాలు బుధవారం అంటే ఏప్రిల్ 24తో ముగియనున్నట్లు చెప్పారు. బుధవారం కూడా భారీ స్థాయిలో దీక్షా పరులు వచ్చి అంజన్నను దర్శించుకుంటారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: రాత్రి 7గంటలకు టీవీ9 బిగ్ డిబేట్ కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.!