Saturday, May 18, 2024

సుక్మా జిల్లా ఎన్‌కౌంటర్‌ ఇద్దరు మావోయిస్టులు మృతి

spot_img

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఇవాళ( మంగళవారం) జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సుక్మా జిల్లాలోని తండమెట్ల, దులేడ్‌ అటవీ ప్రాంతంలో జాగర్‌గుండా ఏరియా కమిటీకి చెందిన 10 నుంచి 12 మందితో కూడిన బృందం తిరుగుతున్నదనే విషయం భద్రతా బలగాలకు తెలిసింది. దీంతో ఉదయం డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనట్లు జిల్లా పోలీసులు తెలిపారు. మిగిలిన వారు పరారయ్యారని, వారికోసం గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.

ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో 12 బోర్‌ డబుల్‌ బ్యారెల్‌ రైఫిల్‌, పిస్తోల్‌, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.మృతి చెందిన వారిని మిలీషియా క్యాడర్‌కు చెందిన సోథి దేవ, రావ దేవగా గుర్తించామన్నారు. వారిద్దరిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందన్నారు.

Latest News

More Articles