జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం కైలాపూర్లో మిరపనారు నాటుతుండగా పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు.
AI-Avatar in G-20 ప్రపంచ నేతలకు స్వాగతం పలుకనున్న ‘అవతార్’..!!
మృతులను సరిత(30), మమత(32)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ పర్లపల్లి భద్రమ్మ, ఆరేపల్లి కొమురమ్మ, మైదం ఉమా అన్, శివ లను ఆస్పత్రికి తరలించారు.
మరో సంఘటనలో కాటారం మండలం దామెరకుంటలో పొలం పనుల్లో నిమగ్నమైన రైతు రాజేశ్వర్ రావు(46)పై పిడుగు పడి మృతి చెందాడు. దీంతో మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.