Saturday, May 4, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి.!

spot_img

అమెరికాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికిచెందిన డాక్టర్ స్వాతి, డాక్టర్ నవీన్ దంపతుల కుమారుడు నివేశ్, జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన కమల్ కుమార్, పద్మ దంపతుల పెద్ద కుమారుడు గౌతమ్ కుమార్ అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు.

శనివారం రాత్రి ఈ ఇద్దరు తమ మిత్రులతో కలిసి విశ్వవిద్యాలయం నుంచి ఇంటికి కారులో వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ కుమార్ అక్కడిక్కడే మరణించారు. మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు అక్కడి పోలీసులు ఆదివారం మ్రుతుల కుటుంబాలకు సమాచారం అందించారు. గౌతమ్ కుమార్ డెడ్ బాడీ స్వగ్రామం చేరుకోవడానికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని మ్రుతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ డెడ్ బాడీ హుజురాబాద్ కు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇది కూడా చదవండి: మాల్దీవుల పార్లమెంటరీ ఎన్నికల ఫలితాలు..భారత్ కు షాక్..?

Latest News

More Articles