Thursday, May 9, 2024

నేడు ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.!

spot_img

నేడు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలను విద్యాశాఖ విడుదల చేయనుంది. విజయవాడలో ఉదయం 11 గంటలకు ఫలితాను విద్యాకమిషనర్ సురేశ్ కుమార్ రిలీజ్ చేయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 6.23లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02 లక్షల మంది పదో తరగతి పరీక్ష రాశారు.

పరీక్షల ప్రక్రియ ముగిసిన వెంటనే అధికారులు మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఈనెల 8వ తేదీ దానిని పూర్తి చేశారు. మరోసారి జవాబు పత్రాల పరిశీలన, మార్కుల నమోదు, కంప్యూటీకరణ ప్రక్రియను ముగించారు. ఎస్ఎస్ సీ బోర్డు అధికారిక వెబ్ సైట్లో స్టూడెంట్స్ ఫలితాలను చెక్ చేసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. పదో తరగతి ఫలితాలు విడుదల చేయగానే ఎలాంటి సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను అధికారులు తీసుకుంటున్నారు. అధికారికంగా పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసిన వెంటనే విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు స్వయంగా ఆన్ లైన్ లో చెక్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ ను పొందుపరిచి https://Results.bse.ap.gov.in/ వెబ్ సైట్లో విద్యార్థులు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి:అమెరికాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి.!

Latest News

More Articles