మెదక్ అల్లదుర్గం (మం) రాంపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికులు ఆగ్రహంతో బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. ప్రయాణికులు ప్రాణభయంతో బస్సులోంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.