Wednesday, May 8, 2024

చెన్నూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరనీయం.. వివేక్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం

spot_img

మంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గంలో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. పూటకో పార్టీ మార్చే వివేక్ వెంకటస్వామి వల్ల బిజెపి పార్టీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని బిజెపి చెన్నూరు నియోజకవర్గ ఇన్చార్జ్ అందుగుల శ్రీనివాస్ తో సహా పలువురు బిజెపి సీనియర్ నాయకులు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫ్యాక్స్ చేసినట్లు నేతలు తెలిపారు.

Also Read.. మంద కృష్ణ ఏడుపు నాటకం.. మోడీ ఓదార్పు బూటకం

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బిజెపి పార్టీని సర్వనాశనం చేయడానికి పథకం ప్రకారం పార్టీలోకి వచ్చి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడు వివేక్. నమ్ముకున్న కార్యకర్తలకు ఏమి చేయని వివేక్ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తాడు. రేవంత్ రెడ్డితో 100 కోట్ల డీల్ సెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీలో వివేక్ చేరాడు. ఎట్టి పరిస్థితుల్లో చెన్నూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరనీయం, వివేక్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.

Latest News

More Articles