కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు చనిపోయారు. ఇవాళ(మంగళవారం) నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల గ్రామం దగ్గర ఈ ప్రమాదం జరింగింది. రాయిచూర్ వైపు నుండి హైదరాబాదు వెళుతున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.. హైదరాబాద్ వైపు నుండి మక్తల్ వైపు వస్తున్నఇద్దరు వస్తున్న స్కూటీ బస్సు ఢీ కొంది. డ్రైవింగ్ చేస్తున్న ఉదయ్ అనే యువకుడు అక్కడికక్కడే చెందగా.. తీవ్ర గాయాల పాలైన అఖిల్ ను జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు.
మృతులు హైదరాబాద్ కు చెందిన వారుగా భావిస్తున్నారు. వారి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను పోలీసులు మక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
ఇది కూడా చదవండి: అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలి