మనవడిని కోడలు కొట్టడం చూసి తట్టుకోలేకపోయిన మామ..కోడలిని హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో జరిగింది. ఎస్సై సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం..విశాకుచెందిన శ్రీనివాస్, సత్యుకుమారిల ఏకైక కుమార్తె నాగశ్రావణిని ఐదేళ్ల కిందట జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కొజు కేశవరావు, సూర్యకుమారిల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమారుడు రిశాంత్, కుమార్తె జస్విత ఉ, సూర్యశ్రీ సంతానం ఉన్నారు. శ్రీనివాసరావు ఉపాధికోసం రెండేళ్ల క్రితం దుబాయికి వెళ్లాడు
. నాగ శ్రావణి తన పిల్లలతో అత్తింట్లోనే ఉంటోంది. ఆదివారం గ్రామంలో ఓ శుభకార్యానికి అత్తమామలతో కలిసి వెళ్లారు. ఇంటికివచ్చిన తర్వాత తన కుమారుడి నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించకపోవడంతో..ఆజాగ్రత్తగా ఉన్నవాంటూ కుమారుడిని కొట్టింది శ్రావణి. ఈ సమయంలో కేశవరావు ఆమెతో గొడవపడ్డాడు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న శ్రావణి తలపై అతడు పచ్చడిబండతో కొట్టడంతో శ్రావణి అక్కడిక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మ్రుతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవరావు తోపాటు అతని భార్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరచూ తన కుమార్తె శ్రావణిని ప్రతి చిన్న విషయానికి మామ నిందిస్తాడని మ్రుతురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: సామాన్యులకు భారీ ఊరట..గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు?