Saturday, May 18, 2024

చెన్నూరులో విషాదం..ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.!

spot_img

వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరి తన కొడుకు, కూతురుతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం..చెన్నూరు మండలం గొర్లపులయ్య వీధికి చెందిన ఉమామహేశ్వరికి కడప నగరానికి చెందిన శ్రీహరితో 2005లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు ఫణికుమార్, కుమార్తె ధనలక్ష్మీ ఉన్నారు. కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో శ్రీహరి ఉపాధికోసం కువైట్ వెళ్లాడు. ఈ క్రమంలో కుటుంబంలో మనస్పర్థలు రావడంతో ఉమామహేశ్వరీ తనకు వద్దంటూ భర్త వాదనకు దిగాడు.

దీంతో ఉమామహేశ్వరి తన పిల్లలతో కలిసి 12సంవత్సరాలుగా చెన్నూరులోని తన అన్న ఇంట్లోనే ఉంటుంది. ఫణికుమార్ మోటార్ మెకానిక్ గా పనిచేస్తుండగా..ధనలక్ష్మీ ఇంటర్ పూర్తి చేసింది. చెల్లెలి కాపురం నెలబెట్టేందుకు రాజేంద్రప్రసాద్ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేవు. భర్త కువైట్ నుంచి వచ్చిన తర్వాత ఉమామహేశ్వరిని కాపురానికి తీసుకెళ్లకపోవడంతో గొడవలు ఎక్కువై కోర్టు వరకు వెళ్లారు. ఉమామహేశ్వరి తన భర్త నుంచి చట్ట ప్రకారం రావాల్సిన డబ్బు కోసం కోర్టును ఆశ్రయించింది. రూ. 10లక్షల నగదు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అంత నగదు చెల్లించలేనంటూ నెలరోజుల పాటు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు.

అయితే ఉమామహేశ్వరి భరణం కోసం మరోసారి కోర్టు మెట్లెక్కింది. కొంత మొత్తం చెల్లించాలని శ్రీహరిని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టుల చుట్టూ తిరిగి జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈనెల 27న సాయంత్రం గుడికి వెళ్లి వస్తానంటూ పిల్లలతో సహా ఇంట్లో నుంచి వచ్చేసింది. అదే రోజు రాత్రి 10గంటలకు తన అన్నకు ఫోన్ ద్వారా మెసేజ్ పంపించారు. పిల్లలో కలిసి చెట్టుకు ఉరేసుకుంది. ఉదయం పశువుల కాపరులు మ్రుతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా  చదవండి: రేపటి నుంచి వారి రేషన్ కార్డులు రద్దు?పూర్తి వివరాలివే.!

Latest News

More Articles