Sunday, May 19, 2024

గుజరాత్‎లో కుప్పకూలిన బ్రిడ్జి.. నలిగిపోయిన ఆటో డ్రైవర్, ప్యాసింజర్

spot_img

గుజరాత్ మోడల్ అని బీజేపీ నాయకలు ఏ రాష్ట్రానికి పోయినా గొప్పలు చెప్పుకుంటారు. మరి ఆ గుజరాత్‎లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పాలన్‌పుర్‌‎లో సోమవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న వంతెన కింద ఆటో ఆగింది. అందులో డ్రైవర్ తో పాటు ఓ ప్యాసింజర్ కూడా ఉన్నాడు. అయితే బ్రిడ్జి కూలడాన్ని గమనించి ఆటో డ్రైవర్.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. కానీ, అది ఫలించలేదు. దాంతో ఆ కాంక్రీట్‌ స్లాబుల కింద అతడు నలిగిపోయి చనిపోయాడు. ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆటోలోని ప్యాసింజర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Latest News

More Articles