గుజరాత్ మోడల్ అని బీజేపీ నాయకలు ఏ రాష్ట్రానికి పోయినా గొప్పలు చెప్పుకుంటారు. మరి ఆ గుజరాత్లో పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. పాలన్పుర్లో సోమవారం మధ్యాహ్నం నిర్మాణంలో ఉన్న వంతెన కింద ఆటో ఆగింది. అందులో డ్రైవర్ తో పాటు ఓ ప్యాసింజర్ కూడా ఉన్నాడు. అయితే బ్రిడ్జి కూలడాన్ని గమనించి ఆటో డ్రైవర్.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశాడు. కానీ, అది ఫలించలేదు. దాంతో ఆ కాంక్రీట్ స్లాబుల కింద అతడు నలిగిపోయి చనిపోయాడు. ఈ ఘటన మొత్తం పక్కనే ఉన్న ఇంటి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆటోలోని ప్యాసింజర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
✴ #Gujarat flyover collapse
▶️#gujaratmodel with #Doublengine sarkar during #AmritKaal #BJPFailsIndia #BJP4IND #Telangana #TelanganaElections2023 pic.twitter.com/ISNgUyzVu9
— Arjun (@arjunactual) October 23, 2023