Saturday, May 18, 2024

టీ అడిగిన భర్త కంట్లో కత్తెరతో పొడిచిన భార్య

spot_img

టీ అడిగిన పాపానికి ఓ భార్య తన భర్త కంట్లో కత్తెరతో పొడిచింది. ఈ దారుణ ఘటన యూపీలోని బాగ్‌ప‌ట్ జిల్లాలో జరిగింది. స్థానికంగా నివసించే అంకిత్‌కు మూడేండ్ల కింద‌ట వివాహ‌మైంది. పెండ్ల‌యిన‌ప్ప‌టి నుంచి భార్యా భ‌ర్త‌ల మధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. గత వారం కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దాంతో అతని భార్య.. అంకిత్‎తో పాటు అతని కుటుంబ‌స‌భ్యుల‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత మూడు రోజులకు అంకిత్.. తనకు టీ ఇవ్వాల‌ని భార్యను అడిగాడు. దీంతో ఆగ్ర‌హానికి లోనైన భార్య అత‌డి కంట్లో క‌త్తెర‌తో పొడిచింది. ర‌క్త‌మోడుతున్న భర్తను చూసి భ‌యప‌డిన భార్య ఘ‌ట‌నా స్ధ‌లం నుంచి ప‌రారైంది. అంకిత్ కేక‌లు వేయ‌డంతో అత‌డి వ‌దిన పిల్ల‌లు బ‌య‌ట‌కు వ‌చ్చారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చి.. అంకిత్‌ను ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మీర‌ట్‌కు త‌ర‌లించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. అంకిత్ భార్య కోసం ప్ర‌త్యేక బృందంతో గాలింపు చేపడుతున్నారు.

Read also: సారూ.. నా పొలం చూడండి.. రైతుబంధు పడలే.. నాటు వేయలే

Latest News

More Articles