హైదరాబాద్: తెలంగాణ యూనివర్సిటీలో పాలకవర్గం, వీసీ మధ్య వివాదం మరింత ముదిరింది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తారాస్థాయికి చేరింది. ఎవరెంత చెప్పినా వీసీ రవీందర్ గుప్తా తీరులో మార్పు రావడం లేదు. తన తీరుతో తరచూ వివాదాల్లో నిలుస్తూ.. రోజుకో వివాదం రాజేస్తున్నారు.
మొన్న జరిగిన మీటింగులో ఈసీతో కలిసి పని చేస్తానన్న వీసీ అంతలోనే మాట మార్చారు. తాజాగా రిజిస్ట్రార్ చాంబర్కు తాళం వేయించారు. అంతటితో ఆగక అక్కడ పని చేసే ముగ్గురిని ఇతర విభాగాలకు కేటాయించారు. ప్రస్తుతం రిజిస్ట్రార్ ఎవరో తనకే అర్థం కావడం లేదని వీసీ వివాదాన్ని రాజేశారు.
కొత్త రిజిస్ట్రార్ను నియమిస్తానని ప్రకటించారు. వర్సిటీలో తన ఆదేశాలే ఫైనల్ అని, ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని తాజాగా సర్క్యులర్ జారీ చేయడం వర్సిటీలో దుమారం రేపుతున్నది.