Sunday, May 19, 2024

లోక్ సభ బరిలో వీరప్పన్ కుమార్తె విద్యారాణి

spot_img

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పోలీసుల ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. వీరప్పన్ కు ఇద్దరు కుమార్తెలు కాగా రెండో కుమార్తె విద్యారాణి ప్రస్తుతం లోక్ సభ బరిలో నిలిచారు. తమిళనాడులోని కృష్ణగిరి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. నాన్ తమిళర్ కట్టి (ఎన్టీకే) పార్టీ తరఫున విద్యారాణి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 19న ఇక్కడ ఎన్నికలు జరగనుండడంతో ప్రచారంలో బిజీబిజీగా తిరుగుతున్నారు. ఈసారి గెలుపు తనదేనని విద్యారాణి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణగిరి నియోజకవర్గంలో రైతులు సాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని, లోక్ సభకు ఎన్నికయ్యాక ఈ సమస్యకు పరిష్కారం కోసం పాటుపడతానని ఆమె వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉందని, ఉన్నత విద్యావంతులకూ తగిన ఉద్యోగం దొరకడంలేదని చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మహిళా సాధికారత కోసం శక్తివంచన లేకుండా పాటుపడతానని విద్యారాణి తెలిపారు.

తన తండ్రి వీరప్పన్ ను చిన్నతనంలో ఒకే ఒకసారి చూశానని విద్యారాణి తెలిపారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో విద్యారాణి తన అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఉన్నత విద్యాభ్యాసం చేసి న్యాయవాద పట్టా అందుకున్నారు. చదువుకునే రోజుల నుంచే ఓ స్కూలును నడుపుతున్నారు. దీంతో పాటు పలు సేవాకార్యక్రమాలు కూడా చేస్తున్నారు. తన తండ్రి నుంచే తనకు సేవాగుణం వచ్చిందని విద్యారాణి చెప్పారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ ఎన్నికల శంఖారావం.. చేవెళ్ల లో ఇవాళ మొదటి బహిరంగసభ

Latest News

More Articles