Sunday, May 19, 2024

షాకింగ్ వీడియో.. వృద్ధుడిని కొమ్ములతో పొడిచి చంపిన ఎద్దు

spot_img

మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన ఓ వృద్ధుడిని ఎద్దు పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‎లోని బరేలీలో గురువారం ఉదయం జరిగింది. బ‌రేలీలోని సంజ‌య్ న‌గ‌ర్‎కు చెందిన కృష్ణానంద్ పాండే(75) షుగ‌ర్ మిల్ మేనేజ‌ర్‌గా ప‌ని చేసి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆయనకు రోజూ మార్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంది. రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా కృష్ణానంద్.. ఉదయం 8 గంటలకు మార్నింగ్ వాకింగ్‎కు బయలుదేరాడు. కాసేపటికే రెండు ఎద్దులు ఎదురుగా వచ్చాయి. అవి ఆ వృద్ధుడికి ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మ‌రో ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. క‌డుపులో కొమ్ముల‌తో పొడిచి, నేల‌పై ప‌డేసింది. అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిన వృద్ధుడిని ప‌దేప‌దే పొడిచింది. దీంతో ఆ వృద్ధుడు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Latest News

More Articles