మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన ఓ వృద్ధుడిని ఎద్దు పొడిచి చంపింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో గురువారం ఉదయం జరిగింది. బరేలీలోని సంజయ్ నగర్కు చెందిన కృష్ణానంద్ పాండే(75) షుగర్ మిల్ మేనేజర్గా పని చేసి పదవీ విరమణ పొందారు. ఆయనకు రోజూ మార్నింగ్ వాకింగ్ చేసే అలవాటు ఉంది. రోజూ మాదిరిగానే ఈ రోజు కూడా కృష్ణానంద్.. ఉదయం 8 గంటలకు మార్నింగ్ వాకింగ్కు బయలుదేరాడు. కాసేపటికే రెండు ఎద్దులు ఎదురుగా వచ్చాయి. అవి ఆ వృద్ధుడికి ఎలాంటి హానీ కలిగించలేదు. ఆ తర్వాత వచ్చిన మరో ఎద్దు వృద్ధుడిపై దాడి చేసింది. కడుపులో కొమ్ములతో పొడిచి, నేలపై పడేసింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన వృద్ధుడిని పదేపదే పొడిచింది. దీంతో ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
#उत्तर_प्रदेश #बरेली के संजय नगर में सुबह मॉर्निंग वॉक पर निकले रिटायर्ड बैंक कर्मचारी को सांड ने जान से मार डाला !!#Bareilly #Bull @bareilly_nn @dmbareilly #viralvideo pic.twitter.com/Dyk5P1MeZg
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) January 24, 2024