Friday, May 17, 2024

మ్యాచ్‌ చూస్తూ.. రెండు గ్లాస్‌ల బీరు లాగించేసిన లేడీ.. వీడియో

spot_img

ద‌క్షిణాఫ్రికా టీ20 లీగ్ రెండో సీజ‌న్ ను క్రికెట్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. శుక్ర‌వారం న్యూలాండ్స్ స్టేడియంలో ఎంఐ కేప్‌టౌన్, పార్ల్ రాయ‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్‌ జరిగింది. మ్యాచ్ సందర్భంగా ఓ ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

Also Read.. ‘వన్‌ నేషన్‌ -వన్‌ ఎలక్షన్‌’ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం

ప్రేక్ష‌కుల గ్యాల‌రీలో కూర్చున్న ఒక మ‌హిళ బీరు గ్లాసుతో కెమెరాల దృష్టిలో ప‌డింది. గ్రౌండ్ లోని పెద్ద స్క్రీన్ మీద ఆమెను చూపించారు. దీంతో సంతోషంలో ఉన్న సదరు మహిళ చేతిలో ఉన్న బీరు గ్లాస్ దించ‌కుండా గ‌డ‌గ‌డా తాగేసింది. ఈ క్రమంలో మరోసారి బిగ్ స్క్రీన్ పై చూపించడంతో.. ఈసారి పక్క‌నే కూర్చున్న ఆమె తండ్రి బీరు కూడా లాగించేసింది.

Also Read.. పెట్టుబడుల డీల్స్ అన్నీ బోగస్.. రేవంత్ పై దాసోజు శ్రవణ్ లెఫ్ట్ రైట్

ఈ ఘటనపై గ్రౌండ్ లో ఉన్న  ప్రేక్ష‌కుల‌తో పాటు కామెంటేట‌ర్లు సైతం ఆశ్చ‌ర్యం వ్యక్తం చేశారు. కామెట‌రీ బాక్స్‌లో మాట్లాడుతున్న కెవిన్ పీట‌ర్స‌న్.. ఆ మ‌హిళను లెజెండ్ అంటూ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest News

More Articles