కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం సావట్లలో రాత్రి ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. కుక్కలు మొరగడంతో ఏం జరుగుతోందని చూసిన ప్రజలకు ఊళ్ళో తిరుగుతూ ఎలుగుబంటి కనిపించింది. వెంటనే అప్రమత్తమైన గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి సంచారంతో భయాందోళనలో సావట్ల గ్రామస్థులు ఉన్నారు.