ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో ఓ మూడంతస్తుల భవనం నేలమట్టం అయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
Hyderabad 18న గణేష్ పండుగ.. సెప్టెంబర్ 28న నిమజ్జనం.. పోలీస్ కమిషనర్ కీలక సూచనలు
జిల్లా ఎస్పీ దినేశ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. భవన శిథిలాల్లో మరో ముగ్గురు చిక్కుకొని ఉండొచ్చని వెల్లడించారు.
#WATCH | UP: Rescue operation underway after a building collapsed in Barabanki pic.twitter.com/IVn3v2Zzrw
— ANI UP/Uttarakhand (@ANINewsUP) September 4, 2023