అయోధ్యలో నిన్న( సోమవారం) జరిగిన బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానం పంపింది. సినీ, క్రీడా రంగాలకు చెందిన సెలబ్రెటీలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఆహ్వానం అందినా కూడా కొంతమంది ఈ వేడుకకు హాజరు కాలేకపోయారు. వారిలో విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కూడా ఉన్నారు. అయితే, అచ్చంగా కోహ్లీలానే ఉండే వ్యక్తి అయోధ్యలో సందడి చేశాడు. టీమిండియా జెర్సీ ధరించి వచ్చిన కోహ్లీ డూప్ తో సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు.
కోహ్లీ డూప్ అని తెలిసినా ఆయనను చుట్టుముట్టి ఫొటోలు తీసుకున్నారు. మొదట సరదాగా సాగిన ఈ తతంగం కాసేపటికే తోపులాట జరిగే వరకు వెళ్లింది. దీంతో బెదిరిపోయిన కోహ్లీ డూప్.. చుట్టుముట్టిన జనంలో నుంచి కష్టమ్మీద బయటపడ్డాడు. ఆపై వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: ఫిబ్రవరి చివర్లో రేషన్ దరఖాస్తులు.. ‘మీసేవ’ల దగ్గర మళ్లీ క్యూ