కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వివో తన రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. వీవో Y200 5జీ కొత్త స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఇంతకుముందు 8జీబీ ర్యామ్ 128జీబీ సింగిల్ స్టోరేజ్ వేరియంట్లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చైనీస్ బ్రాండ్ ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ నుంచి కొత్త 8జీబీ ర్యామ్ 256జీబీ వేరియంట్ను మార్కెట్లోకి పరిచయం చేసింది. కొత్త వేరియంట్ను లాంచ్ చేయడంతో పాటు, కంపెనీ దానిపై ఆఫర్లను కూడా ప్రకటించింది.
వివో ఈ మధ్య-బడ్జెట్ ఫోన్ కొత్త వేరియంట్ 23,999 రూపాయలకు లాంచ్ చేసింది. దీని బేస్ వేరియంట్ రూ.21,999కి వస్తుంది. ఈ ఫోన్ను ఇ-కామర్స్ వెబ్సైట్లు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వివో ఇ-స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఫోన్ కొనుగోలుపై రూ.2,000 క్యాష్బ్యాక్ ఆఫర్ను అందిస్తోంది.
ఈ ఫోన్ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇది 6.67 అంగుళాల అల్మోడ్ డిస్ప్లే తో వస్తుంది. దీని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ గరిష్ట ప్రకాశాన్ని 800 నిట్ల వరకు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 8జీబీ ర్యామ్ 256జీబీస్టోరేజీని కలిగి ఉంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇది 64మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 2మెగాపిక్సెల్ సేఫ్టీ కమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఇది 16మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 4,800ఎంఏహెచ్ బ్యాటరీ 44వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్కు సపోర్టు చేస్తుంది.
వీవో Y27, వీవో T2 5జీ ధరలు తగ్గాయి:
వీవో Y27 ధరను రూ. 3,000 తగ్గించింది. ఈ ఫోన్ రూ.14,999కి లాంచ్ అయింది. మీరు ఇప్పుడు రూ. 11,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై రూ.1,000 క్యాష్బ్యాక్ కూడా అందిస్తుంది. వీవో T2 5G ధర కూడా రూ. 2,000 తగ్గింది. 17,999 ధరతో ఈ ఫోన్ లాంచ్ అయింది. ఇప్పుడు మీరు ఈ ఫోన్ను రూ.15,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది – 6జీబీర్యామ్ + 128జీబీ 8జీబీ ర్యామ్ 128జీబీ తో వస్తుంది.
ఇది కూడా చదవండి: రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత.. జయశంకర్ యూనివర్సిటీ బంద్..!