Saturday, May 4, 2024

చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలి

spot_img

‘ఆయా రామ్‌.. గయా రామ్‌’ సంస్కృతికి కాంగ్రెస్‌ మాతృసంస్థ అంటూ పార్టీ ఫిరాయింపులపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్‌ అని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్‌ మనసు మార్చుకున్నట్లు కనిపిస్తుందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారితే సభ్యత్వం రద్దు అనే హామీని ప్రకటించిందని, పదో షెడ్యూల్‌ చట్ట సవరణ హామీ స్వాగతించదగినదని చెప్పారు.

ఇది కూడా చదవండి: పైలట్‌ స్పెషల్‌ అనౌన్స్ మెంట్‌.. తల్లి కంటతడి

కానీ కాంగ్రెస్‌ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటన్నారు కేటీఆర్. ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ విధానాలు ఉంటాయన్నారు. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ చేర్చుకుందని, అందులో ఒక ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ ఇచ్చిందని తెలిపారు. హామీలపైన నిబద్ధత ఉంటే ఈ అంశంపై రాహుల్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ కపటవాదుల పార్టీ కాదని రాహుల్‌ గాంధీ చెప్పగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెల్‌ చేరిన ఇద్దరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలన్నారు. వారిని అనర్హులని స్పీకర్‌ ప్రకటించాలని చెప్పారు. చెప్పిందే చేస్తాం.. అబద్ధాలు చెప్పబోమని కాంగ్రెస్‌ నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు కేటీఆర్.

Latest News

More Articles