హైదరాబాద్ : వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై పౌర సమాజం భగ్గుమంటున్నది. సోషల్ మీడియా వేదికగా పార్టీలకు అతీతంగా మంత్రి హరీశ్ రావుకు మద్దతు పెరుగుతున్నది.
మైనంపల్లికి వ్యతిరేకంగా, హరీశ్కు మద్దతుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దీంతో ట్విటర్ ‘వి ఆర్ విత్ హరీశ్ అన్నా’ #WeAreWithHarishAnna హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ టాప్లోకి వచ్చింది. ఎమ్మెల్యే హనుమంతరావును కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్లు, రీట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి.
మెదక్ స్థానం నుంచి తన కొడుకు రోహిత్కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మైనంపల్లి డిమాండ్ చేశాడు. మైనంపల్లికి మల్కాజిగిరి సీటును మళ్లీ ఇచ్చిన బీఆర్ఎస్ ఆయన కొడుక్కు మాత్రం నిరాకరించింది. దీంతో రెచ్చిపోయిన మైనంపల్లి మంత్రి హరీశ్రావును టార్గెట్ చేసుకొని విమర్శించారు. మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత సైతం హరీశ్ రావుకే మా మద్దతు అని ఇది వరకే ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.