రాజస్థాన్ జైపూర్లో ఇవాళ(మంగళవారం) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌసా జిల్లా మండవార్ లో ఎదురెదురుగా వచ్చిన ట్రక్కు, జీపు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. మరో 11 మంది గాయపడ్డారు. ఇందులో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అల్వార్ నుంచి మహ్వా వైపు కూల్ డ్రిక్స్ లోడ్తో వెళ్తున్న ట్రక్కు.. మహ్వా నుంచి మండవార్ వైపు వెళ్తున్న జీపు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులతో సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిన మహ్వా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరికొందరిని జైపూర్కు తరలించారు పోలీసులు. ఢీ కొన్న వాహనాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.