భారత్, వెస్టిండీస్ జట్లు కీలకమైన నాలుగో టీ20 పోరు ప్రారంభమైంది. సిరీస్లో నిలవాలంటే టీమిండియా కచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి. ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలుపొందిన విండీస్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే సిరీస్ సొంతం చేసుకుంటుంది.
అమెరికాలోని ఫ్లోరిడా లో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ రొవమన్ పావెల్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మూడో టీ20కి దూరమైన జేసన్ హోల్డర్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా సారథ్యంలో మార్పులు లేకుండానే టీమిండియా బరిలోకి దిగుతోంది.
ఇండియా జట్టు : యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్ కుమర్.
వెస్టిండీస్ జట్టు : కైలీ మేయర్స్, బ్రాండన్ కింగ్, షై హోప్ , నికోలస్ పూరన్(వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మైర్, రొవ్మన్ పావెల్(కెప్టెన్), ఒడియన్ స్మిత్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకీల హొసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్కాయ్.