హైదరాబాద్: అయోధ్యలోని బాలరాముడి దేవాలయం జనవరి 23 నుండి సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది. దర్శనం కోసం ముందుగా నిర్ణయించిన సెషన్ల సమయంలో రామ్ లల్లా దర్శనం కోసం వేలాది మంది భక్తులు, యాత్రికులు సందర్శించవచ్చు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర వెబ్సైట్ ప్రకారం.. శ్రీరామ జన్మభూమి వద్ద ఉన్న క్యాంపు కార్యాలయంలో చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ను సమర్పించడం ద్వారా ఆఫ్లైన్ పాస్లను పొందవచ్చు. ఆలయ సందర్శన వేళలు ఉదయం 7:00 నుండి 11:30 వరకు.. మధ్యాహ్నం 2:00 నుండి రాత్రి 7:00 వరకు ఉంటుంది.