Monday, May 20, 2024

ట్రాన్స్ జెండర్‎గా మారిన భర్తను సుపారీ ఇచ్చి చంపించిన భార్య

spot_img

ట్రాన్స్ జెండర్‎గా మారి తనను వేధిస్తున్న భర్తను ఓ భార్య సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్దిపేట‌లోని బోయిగ‌ల్లీలో నివాసముంటున్న వెంకటేశ్, వేద శ్రీలకు 2014లో వివాహమైంది. వారికి 2015లో ఓ పాప జన్మించింది. అనంతరం కొన్నాళ్లకు వెంకటేశ్ ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. చీర కట్టుకోవడం, చెవులకు కమ్మలు పెట్టుకోవడం, గాజులు వేసుకోవడం వంటివి చేసేవాడు. చివరికి అదనపు కట్నం కోసం భార్యను వేధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2019లో ట్రాన్స్ జెండర్‎గా మారి తన పేరును రోజాగా మార్చుకున్నాడు. అప్పటి నుంచి భార్య వేద శ్రీని వేధించడం ఇంకా ఎక్కువ చేశాడు.

వేదశ్రీ ఓ స్కూల్ లో టీచర్ గా పనిచేసేది. అక్కడకి వెంకటేశ్ చీర కట్టుకొని వెళ్లి పలుమార్లు గొడవ చేశాడు. దాంతో ఆమె ఉద్యోగం పోయింది. ఇవన్నీ మనసులో పెట్టుకున్న వేద శ్రీ.. తన భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా తన భర్తను హత్య చేయాలని 2023 సెప్టెంబర్‎లో భర్త గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తితో రూ.18 లక్షల సుపారికి మాట్లాడుకుంది. అడ్వాన్స్ కింద రూ.4.60 లక్షలు కూడా చెల్లించింది. దాంతో గత నెల డిసెంబర్ 11న వెంకటేశ్ ‎ని మద్యం తాగించి హత్య చేశారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేసి.. నిందితుల బండారాన్ని బయటపెట్టారు.

Read Also: ‘ప్రజాపాలన’కు దరఖాస్తు చేసుకున్న శివుడు.. సోషల్ మీడియాలో వైరల్

Latest News

More Articles