Sunday, May 19, 2024

కొడుకు లవ్ మ్యారేజ్.. నువ్వే కారణమంటూ తిట్టడంతో సూసైడ్ చేసుకున్న తల్లి

spot_img

కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి నువ్వే కారణమంటూ భార్యను భర్త తిట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని జల్లి తండాలో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన జర్పుల ప్రవీణ్‎కి స్వరూపతో 24 సంవత్సరాల క్రితం వివాహామైంది. ప్రవీణ్ పెండ్లి అయినప్పటి నుండి స్వరూపను ఇష్టానుసారంగా కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక గతంలోనే స్వరూప రెండుసార్లు చావడానికి ప్రయత్నం చేసింది. పలుమార్లు పెద్దమనుషులు పంచాయతీలు చేసి భార్యాభర్తల మధ్య సర్దుబాటు చేస్తూ వచ్చారు.

Read Also: హనీమూన్‎కు గోవా అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లిన భర్త.. విడాకులకు కోర్టుకెక్కిన భార్య

తాజాగా ఈ దంపతుల కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలోనూ స్వరూపను ప్రవీణ్ నువ్వే కారణమంటూ కొట్టాడు. బుధవారం సాయంత్రం మధ్యం మత్తులో ఇంటికి వచ్చి స్వరూపను తీవ్రంగా కొట్టి, ఏదైనా మందు తాగి చావు అని తిట్టడంతో.. స్వరూప పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. స్వరూప తల్లి మల్లికాంబ ఫిర్యాదు మేరకు ప్రవీణ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles