ఆ జంటకు కొత్తగా పెళ్లైంది. వారిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ.. భారీ జీతాలు అందుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత ఇద్దరూ హనీమూన్కు వెళ్లాలనుకున్నారు. హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లడంతో.. ఆ భర్తతో విడాకులు కావాలని కోర్టుకెక్కింది భార్య. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
భోపాల్కు చెందిన మహిళకు ఓ వ్యక్తితో ఐదు నెలల క్రితం పెళ్లైంది. పెళ్లి తర్వాత భార్యను హనీమూన్కు గోవా తీసుకెళ్తానని మాటిచ్చాడు. అందులో భాగంగా ట్రిప్ ప్లాన్ చేశాడు. అయితే ట్రిప్ కు ఒకరోజు ముందు భార్యకు షాకిచ్చాడు. తన తల్లిదండ్రులతో కలిసి అయోధ్య రామమందిర ప్రారంభానికి వెళ్తున్నట్లు చెప్పాడు. ఆ టైంలో చేసేదేం లేక.. భర్త, అత్తా-మామలతో కలిసి అయోధ్య, వారణాసికి వెళ్లింది. 10 రోజుల ట్రిప్ తర్వాత ఇంటికి వచ్చారు. అసలు కథ అప్పుడే మొదలైంది. పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి.. తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. అక్కడ భోపాల్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసింది.
Read Also: రెచ్చిపోయిన లవర్స్.. కారులో నగ్నంగా రొమాన్స్
తన భర్త హనీమూన్కు గోవా అని చెప్పి అయోధ్య తీసుకెళ్లాడని, తన కన్నా అతని తల్లిదండ్రులకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడని ఆమె తన విడాకుల పిటిషన్లో పేర్కొంది. స్వీకరించిన కోర్టు.. జంటను పిలిపించి వారితో మాట్లాడింది. ప్రస్తుతం వారిద్దరికీ కొన్ని వారాల పాటు కౌన్సిలింగ్ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.