హైదరాబాద్ లోని మద్యం ప్రియులకు వారం రోజుల వ్యవధిలోనే రెండో షాక్ తగిలింది. రేపు (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా నగర వ్యాప్తంగా రేపు బార్లు, మద్యం షాపులు బంద్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్, బార్లు మూతపడ్డాయి. వారం తిరగక ముందే మరోసారి షాపులు బంద్ కానున్నాయి. రేపు వైన్ షాపులు మూతపడనున్న నేపథ్యంలో లిక్కర్ కొనుగోలు చేసే వాళ్లు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రేపటికి అవసరమైన లిక్కర్ ను ఇవాళనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగరంలోని పలు వైన్స్ ల దగ్గర జనం బారులు తీరారు.
ఇది కూడా చదవండి:బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్పై మరో కేసు