మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్పై ఇటీవల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని యాదవ సంఘం నేతలు, సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.గురువారం హన్మకొండలో ఏర్పాటు చేసిన ధర్నాను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అహంకారపూరితమైనవి. చాల బాధ్యతారాహిత్యమని అన్నారు.
వెంటనే యాదవ వర్గానికి రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకుంటే యాదవులు ఆందోళనను ఉధృతం చేస్తామని కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. గొప్ప చరిత్ర, సంస్కృతి కలిగిన యాదవులు గర్వించదగిన సమాజమని అన్నారు.