Saturday, May 4, 2024

దశాబ్ది ఉత్సవాల్లో ప్రజలకు ప్రభుత్వ విజయాలు తెలియజేయండి

spot_img

నేడు కొత్త సచివాలయంలో జరిగిన తోలి క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ విషయాలని మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వివరించారు. మంత్రి హరీష్ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని నిర్ణయం తీసుకున్నాం.

రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయాలను 21 రోజుల పాటు అధికారికంగా జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కుల వృత్తులను ప్రోత్సహించాలని బీసీ కులాల సంబంధించి మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది’ అని చెప్పారు హరీష్ రావు.

Latest News

More Articles