111 జీవో పూర్తిగా ఎత్తివేస్తూ నేడు జరిగిన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం. ఇక హెచ్ఎండీఏ కు ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. 111 జీవో ప్రాంతాలకు అవ్వే వర్తిస్తాయి. 111 జీవో పరిధిలో నీటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక రాబోయే రోజుల్లో కాళేశ్వరం జలాలను మూసి, హిమాయత్ సాగర్ ను లింక్ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ ను కూడా గోదావరి జలాలను లింక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.హెల్త్ డిపార్ట్మెంట్ లో పలు నిర్ణయాలు జరిగాయి. 10 జిల్లాలు 33 జిల్లాలుగా ఏఏర్పడ్డాయి కాబట్టి పునరేకీకరణలో మొత్తం 38 జిల్లాలకు వైద్యాధికారులు రానున్నారు.