Wednesday, May 22, 2024

కేసీఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్‎గా ఉన్నారు.. యశోద వైద్యులు

spot_img

తుంటి ఎముక విరిగి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిజికల్లీ, మెంటల్లీ స్ట్రాంగ్‎గా ఉన్నారని యశోద వైద్యులు తెలిపారు. ఈ చికిత్స జరిగిన వారికి 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరముంటుందని, కానీ కేసీఆర్ శరీరం బాగా రెస్పాండ్ అవుతుందని, తద్వారా మరో రెండుమూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్ ప్రవీణ్ రావు మీడియాతో మాట్లాడారు.

Read Also; ఎమ్మెల్యే వెడ్స్ ఐఏఎస్‌.. లక్షల మందికి ఆహ్వానం

‘తుంటి ఎముక మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. త్వరితగతిన కోలుకోవడానికి అనుకూలంగా కేసీఆర్ శరీరం సహకరిస్తోంది. మానసికంగా కూడా ఆయన దృఢంగా ఉన్నారు. ఆయన చాలా వేగంగానే రికవరీ అవుతున్నారు. వాకర్‎తో బెడ్ బయటకు వచ్చి కూర్చున్నారు. వాకర్ సాయంతో మేము రూంలో నడిపించే ప్రయత్నం చేసినపుడు ఆయన శరీరం బాగా స్పందించింది. రూమ్‎లో వాకర్ సాయంతో కేసీఆర్ నడిచారు. దీన్ని మెడికల్ పరిభాషలో ‘ మొబిలైజేషన్ స్టార్ట్’అంటారు. హిప్ రీప్లేసెమెంట్ జరుగగానే పేషెంట్‎ను నడిపించే ప్రయత్నం చేస్తాం. వారు ఆపరేషన్ నొప్పి తగ్గి ‘మినిమల్ పెయిన్’తో కోలుకుంటున్నారు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్‎లు కూడా చేయిస్తున్నాం. మెడికల్‎గా స్టేబుల్‎గా ఉన్నారు. మెంటల్లీ స్ట్రాంగ్‎గా ఉన్నారు. ప్రస్తుతం కేసీఆర్ నార్మల్ ఫుడ్ తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల పాటు ఫిజియో థెరఫీ కొనసాగించాల్సి వుంటుంది. ఇట్లానే శరీరం సహకరిస్తే మరో రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తాం’ అని డాక్టర్ ప్రవీణ్ రావు తెలిపారు.

Latest News

More Articles