Sunday, May 12, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో యువకుడి సూసైడ్

spot_img

నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్ట్‎లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్ పోర్టులోని అమెజాన్ బిల్డింగ్ సమీపంలో చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని హర్యానాకు చెందిన పర్వేజ్ (22)గా పోలీసులు గుర్తించారు. పర్వేజ్ ఎయిర్ పోర్ట్‎లోని అమెజాన్ కంపెనీలో తాత్కాలిక డ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. కాగా.. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.

Read Also: ఆసియా గేమ్స్‌లో భారత్‌ బోణీ.. ఖాతాలోకి మూడు పతకాలు

Latest News

More Articles