నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎయిర్ పోర్టులోని అమెజాన్ బిల్డింగ్ సమీపంలో చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని హర్యానాకు చెందిన పర్వేజ్ (22)గా పోలీసులు గుర్తించారు. పర్వేజ్ ఎయిర్ పోర్ట్లోని అమెజాన్ కంపెనీలో తాత్కాలిక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కాగా.. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్ట్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Read Also: ఆసియా గేమ్స్లో భారత్ బోణీ.. ఖాతాలోకి మూడు పతకాలు